క్యాప్లిన్‌ పాయింట్‌ జోరు వరుసగా ఆరో సెషన్‌లోనూ క్యాప్లిన్‌ పాయింట్‌లో జోరు కొనసాగుతోంది. తమ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభించడంతో ఈ స్టాక్‌ ఇవాళ ఇంట్రాడేలో దాదాపు 19 శాతం లాభపడి డే గరిష్ట స్థాయి రూ.944.50కు పెరిగింది. ఇది రికార్డ్‌ స్థాయి గరిష్ట స్థాయి కావడం విశేషం. ప్రస్తుతం డే గరిష్ట స్థాయికి సమీపంలో 18.50శాతం లాభంతో రూ.938 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో 52.50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7068 కోట్లకు చేరింది. కంపెనీ ఈపీఎస్‌ 32.03, పీఈ 29.15గా ఉంది. ఈ నెల్లో ఇప్పటివరకు క్యాప్లిన్‌ పాయింట్‌ 40శాతం పైగా లాభపడింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 3.8శాతం పెరిగింది.